కాకినాడ డిపో నుండి సరస్వతి దామం - పుష్కర యాత్ర
సరస్వతి నదీ పుష్కరాల సందర్భంగా, కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు గారు "స్టార్ లైనర్ నాన్-ఏ.సి స్లీపర్" బస్సును ఈరోజు ప్రారంభించారు.
15.05.2025 నాడు సాయంత్రం 4 గంటలకు మొదటి బస్సు కాళేశ్వరం బయలుదేరి, అక్కడ పుణ్యస్నానాలు, మహాకాళేశ్వరుని దర్శనం తరువాత రామప్ప దేవాలయం, వరంగల్ వేయిస్తంభాల మండపం, భద్రకాళి దేవాలయం దర్శనం, ధర్మపురిలో స్నానాలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్ర దర్శనం తరువాత 18.05.2025 న ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
రెండవ బస్సు 22.05.2025 న "సూపర్ లగ్జరీ బస్సు" బయలుదేరుతుంది.
ఆసక్తి గల ప్రయాణికులు డిపో నందు సంప్రదించగలరు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి