సరస్వతి ధామం పుష్కర యాత్రకు కొవ్వూరు నుండి బస్సులు

సరస్వతి ధామం పుష్కర యాత్రకు కొవ్వూరు నుండి బస్సులు 
కొవ్వూరు డిపో నుండి ప్రప్రధమంగా సరస్వతి ధామం పుష్కర యాత్రకు స్పెషల్ బస్సు 14.05,2025 సాయంత్రం 04.00 గంటలకు (సూపర్ లగ్జరీ) బయలుదేరి భాసర జ్ఞాన సరస్వతి దేవి, దక్షిణ త్రివేణి సంగమం (గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతీ నదులు) లో పుణ్య స్నానం ధర్మపురి %% శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కాళేశ్వరం మహా కాళేశ్వరుడు సరస్వతి పుష్కర స్నానం కొండగట్టు ఆంజనేయ స్వామి వేములవాడ రాజ రాజేశ్వర స్వామి వరంగల్ %% భద్రకాళీ మాత రామప్ప రామప్ప దేవాలయ దర్శనం అనంతరం 17.05.2025 న ఉదయం కొవ్వూరు చేరునని డిపో మేనేజర్ వైవివి. ఎన్ కుమార్ తెలిపారు. కొవ్వూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు విశేషంగా ఆధరిస్తున్నందున మరియు సరస్వతి పుష్కరాలకు విశేష స్పందన కారణం గా ది 19.05.2025 న సాయంత్రం 04.00 గంటలకు ఇంద్ర (ఎ సి ) బస్సు బయలుదేరునని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డిపోలో సంప్రదించాలని, యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ తెలియజేశారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

Maternity leaves