ఒంగోలు నుండి బెంగళూరుకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు
బెంగళూరుకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు
ఒంగోలు టౌన్: ప్రయాణికుల సౌకర్యార్థం ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి బెంగళూరుకు సూపర్ లగ్జరీ సర్వీసును ఆదివారం ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ డి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు ఒంగోలు నుంచి బయలుదేరి కందుకూరు, పామూరు, ఉదయగిరి, బద్వేలు, కడప, మదనపల్లి మీదుగా బెంగళూరు చేరుకుంటుందని తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు ఒంగోలులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని చెప్పారు. అలాగే, బెంగళూరులో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు ఒంగోలు చేరుకుంటుందని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి