పోస్ట్‌లు

10 D ఫారము గురించి

 మిత్రులారా! 10D ఫారము గురించి తెలుసుకుందాము.  👉1.ఉద్యోగి పెన్షన్ పొందడానికి ఇవ్వవలసిన ఫారము ను 10D ఫారము అంటారు.  👉2.నెలవారీ పెన్షన్ పొందడానికి ఉద్యోగి సమర్పించవలసిన ఫారమునే 10D ఫారము అంటారు.  👉3.EPFO సభ్యులైన వారందరికీ  నెలవారి పెన్షన్ మంజూరు చేస్తారు. దీనిలో 2,3 రకాలు ఉన్నాయి.  👉4.ఉద్యోగి పెన్షన్ పొందాలంటే కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. మరియు 58 సంవత్సరాలు వచ్చి ఉండాలి.  👉5.ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించి నట్లయితే ఆ ఉద్యోగి యొక్క నామినికి వితంతువు పెన్షన్ ను అలాగే ఉద్యోగి అంకవైకల్యము పొందినట్లయితే అంకవైకల్య పెన్షన్ ను పొందుతారు. కొన్ని సందర్భాల్లో 58 సంవత్స రాలకు పొందవలసిన పెన్షన్ ను 50 సంవత్సరాలకే పొందవచ్చు. దీనిని Reduced పెన్షన్ అంటారు. దీనికి వచ్చే వాస్తవ పెన్షన్ కన్నా తక్కువ వస్తుంది.  👉 6.EPFO నుండి పెన్షన్ పొందాలంటే ఆ ఉద్యోగి కాని లేక ఆ ఉద్యోగికి సంబంధించిన వారు కాని తప్ప కుండా  ఒక దరఖాస్తు ను EPFO కు ఆన్ లైన్ గాని ఆఫ్ లైన్ లో గాని సమర్పించాలి.  👉7.మన APSRTC మినహయింపు పొందిన సంస్థ కాబట్టి మన ఉద్యోగులు ఆఫ్ లైన్ లోనే...

Student Buspass Online Registration Process

  స్టూడెంట్ ఆన్లైన్ లో బస్ పాస్ రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం   👉    Click Here

నేను RTC డ్రైవర్

*నేను RTC డ్రైవర్ ను*  నేను పెద్దగా చదువుకోలేదు, కానీ ప్రతి ఉదయం కొన్ని వేల మందిని ఉన్నత విద్య కోసం వారి విద్యాలయాలకు సమయానికి పంపాలనే తాపత్రయం నాది... ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ను*, ప్రతిరోజు వందల కిలోమీటర్లు బస్సు నడిపి బక్క చిక్కిన ఎముకల గూడు నాది, అయినా సరే ఒంటి చేత్తో వంద మంది ఎక్కిన బస్సును గమ్యం చేర్చే నేర్పు నాది... ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ని* ఇంట్లో సమస్యలు ఇబ్బంది పెడుతున్న, ఒంట్లో సమస్యలు నన్ను ఓపిక లేకుండా చేస్తున్న, నా డ్రైవింగ్ సీట్ ఎక్కగానే 16 ఏండ్ల పడుచు కుర్రోడిని అయిపోత, ఎందుకంటే..... *నేను RTC డ్రైవర్ ను* నా పిల్లల భవిష్యత్ కోసం పైసా పైసా పోగెస్తా, నైట్ అవుట్ నరకంలాగ ఉన్నా...  MGBS లొ జాలిలేని దోమలు నా ఒంటిని  జాలి చేస్తున్న రాత్రంతా వాటితో సహవాసం చేస్త... ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ను* లోకమంత దసరా, దీపావళి ఆనందంగా జరుపుకుంటున్నారు, కానీ పండగ పూట ఇంట్లో నాన్న లేడు ఎందుకమ్మా ? అని అడిగే నా చిన్నారి తల్లికి తెలియదు, వాళ్ళ నాన్న పండగ పూట బస్సు నడపకుంటే వందల కుటుంబాలకు పండగ ఉండదని,, ఎందుకంటే  *నేను RTC డ్రైవర్ ను* ఎండాకాలం వేడి ఎం...

Intoxication కేసు ల గురించి

Intoxication కేసు ల గురించి (ఉద్యోగ భద్రత సమాచారం)   👉Cir. No.PD-11/2020,Dt.18.06.2020 ప్రకారం:- 👉 *1.బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 10%mg కాని 10%mg కంటే తక్కువ నమోదు అయినప్పుడు*   👉a.క్షమాపణ పత్రం(Apology Letter)వ్రాసి ఇవ్వాలి.  👉b.ఒకవేళ క్షమాపణ పత్రం వ్రాసి ఇవ్వని పక్షంలో చార్జిషీట్ ఇచ్చి సెన్ స్యూర్ (Censure) ఇస్తారు.  👉 *2.బ్రీత్ ఎనలైజరు రీడింగ్ 10%mg కంటే ఎక్కువ 30%mg వరకు నమోదు అయినప్పుడు:* 👉a.సెక్యూరిటీ (SASI/RHC) రిపోర్ట్ ద్వారా యూనిట్ ఆఫీసర్ (డిపో మేనేజరు) కు ఫర్ ధర్ యాక్షన్ నిమిత్తం పంపిస్తారు. 👉ఆ రిపోర్ట్ లో డ్రైవర్ పేరు, స్టాఫ్ నెంబర్, డ్యూటీ వివరములు, బస్ నెంబర్,డేట్ ,రీడింగ్ తీసుకున్న సమయాలు, రీడింగ్ సీరియల్ నెంబర్, రీడింగ్ పర్సెంట్ లు, ఎవరి సమక్షంలో రీడింగ్ తీసారో వారి సంతకం, రీడింగ్ తీసుకున్న Rtc కానిస్టేబుల్ గారి సంతకం,బస్ out going late,మార్చిన స్టాప్(Cond/Dri) పేరు, స్టాఫ్ నెంబర్, పట్టుబడిన వారియొక్క గత చరిత్ర, etc,ఉంటాయి.  👉ఆ రిపోర్ట్ తో పాటు గా పట్టుబడిన  ఉద్యోగి స్పాట్ సంజాయిషీ, సాక్షి సంతకము తో లెటర్ రిపోర్ట్ కు జతపరిచి యూనిట్ ఆ...

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

*ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం* ఏపీ ఉద్యోగుల బదిలీపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల బదిలీల్లో అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. మరో ఏడు రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును పెంచాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. బదిలీలకు సంబంధించిన నిబంధనలివే.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయిన ఏపీ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశించింది. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీ చేయనుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు రిటైర్‌మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో ఏపీ ప్రభుత్వం ప్రాధా...

APSRTC సిబ్బంది నిజాయితీ

చిత్రం

ఒంగోలు నుండి బెంగళూరుకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు

బెంగళూరుకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఒంగోలు టౌన్: ప్రయాణికుల సౌకర్యార్థం ఒంగోలు ఆర్టీసీ డిపో నుంచి బెంగళూరుకు సూపర్ లగ్జరీ సర్వీసును ఆదివారం ప్రారంభించనున్నట్లు డిపో మేనేజర్ డి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు ఒంగోలు నుంచి బయలుదేరి కందుకూరు, పామూరు, ఉదయగిరి, బద్వేలు, కడప, మదనపల్లి మీదుగా బెంగళూరు చేరుకుంటుందని తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు ఒంగోలులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని చెప్పారు. అలాగే, బెంగళూరులో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు ఒంగోలు చేరుకుంటుందని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Latest News

చిత్రం
ఉద్యోగుల సమస్యలపై AP ప్రభుత్వం 30.05.25 న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ,ఉద్యోగ సంఘాలకు చర్చలకు ఆహ్వానించింది.

ఉద్యోగ భద్రతపైన సామాన్య ఉద్యోగ సందేహాలు...నివృత్తి

*ఉద్యోగ భద్రతపైన సామాన్య ఉద్యోగ సందేహాలు...నివృత్తి*  *సందేహము:- జి.వో నెంబరు: 70,71 మేరకు ఎవరైన కండక్టరు తన వృత్తిలో ప్రయాణికుడి వద్దనుండి టిక్కెట్టుకు డబ్బులు తీసుకుని పొరపాటున ఇవ్వకపోతే… సస్పెండు చేస్తారా? తెలియజేయగలరు*   నివృత్తి:- జి.వో నెంబరు: 70,71 మేరకు అందులో పేర్కోన్న నేరారోపణ మేరకు ఐటం నెంబరు కనబరస్తూ… చార్జిషీటు ఇస్తారు. సస్పెండు చేయరు (1/19 మేరకు), తదుపరి ఆ చార్జిషీటుకు సంజాయిషి ఇచ్చిన పిదప   సర్క్యులర్ 1/19 మేరకు 1 సం..ము w/c/e Punishmment ఇస్తారు. గత రెండు సం..ములుగా ఇలాంటి కేసులలో కండక్టర్లు సస్పెండు,రిమూవల్ కాబడివున్నారు. (ఉదా: కదిరి డిపోలో 3 గ్గురు సస్పెండు గురికాబడినారు) . నిన్న ఎన్.ఎం.యు.ఎ నాయకుల మీటింగ్ మేరకు హెడ్ ఆఫీసు ఇచ్చిన సర్క్యులర్ మేరకు కేవలం జి.వో నెంబరు: 70,71 మేరకు చార్జిషీటు ఇస్తారు (సెక్షన్ లను పేర్కోంటు), అంతియే కాని యాక్షన్ మాత్రము సర్క్యులర్ 1/2019 లో పేర్కోనబడినట్తుగా నే చేయురు

Senior citizens: కేంద్రం నుంచి స్పెషల్ ఆఫర్లు… ఒక్క అర్హత చాలు

Senior citizens: కేంద్రం నుంచి స్పెషల్ ఆఫర్లు… ఒక్క అర్హత చాలు… పదవీ విరమణ తర్వాత జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఎంతో ముఖ్యం. భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు అనేక ఆర్థిక ప్రయోజనాలు అందించడమే కాకుండా, వారిని ఆర్థికంగా స్వతంత్రంగా జీవించడానికి పెద్ద అవకాశాలు కల్పిస్తోంది. ఈ ప్రయోజనాలు సీనియర్ సిటిజన్లకు ఒక అద్భుతమైన ఆదాయ మార్గాన్ని అందిస్తాయి. రిటైర్ అయిన తర్వాత కూడా మీరు గౌరవంగా, ఆర్థికంగా భద్రంగా జీవించడానికి ఈ పథకాలు ఎంతో ఉపయోగకరమైనవి. ఇక, ఈ ఆర్థిక ప్రయోజనాలు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్లకు అందించే ముఖ్యమైన ప్రయోజనాలు పదవీ విరమణ తర్వాత చాలా మందికి ఆదాయం ఆగిపోతుంది. అయితే, ఆరోగ్య ఖర్చులు, రోజు రోజుకి అవసరాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో, ప్రభుత్వ సాయం వలన సీనియర్ సిటిజన్లకు కొంత ఆదాయాన్ని పొందడం సులభమవుతుంది. ఈ సందర్భంగా, ప్రభుత్వ విభాగాలు, ఆర్థిక సంస్థలు, మరియు బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎక్కువ వడ్డీని అందిస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ ...

ఆటోనగర్ లో ఇంటిగ్రేటెడ్ బస్టాండ్

ఆటోనగర్ లో ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ RTC ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించేందుకు చర్యలు ప్రారంభించింది. ఆటోనగర్ డిపోను ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్గా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. గతంలో తయారు చేసిన DPRలో అవసరమైన మార్పులు చేయిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో జి+2 భవనంగా నిర్మించబోయే ఈ ప్రాజెక్టులో మాల్స్, థియేటర్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు.

పుష్కరాలకు మనమూ వెళ్దామా

చిత్రం

OT CALCULATION DETAILS

 అందరికీ 🙏..... 🌹🌹🌹🌹 తెలియని వారు తెలుసుకొనుటకై 🌹🌹 Today OT లెక్కించే ఫార్ములా...గురుంచి తెలుసుకుందాం 👉ఫార్ములా.... [{ (Basic +DA)×12 }÷ 365×8]×2 అప్లై చేసేటప్పుడు  Basic +DA కూడుకోండి  తరువాత కూడుకున్న దాన్ని 12 తో గుణించండి మరియు 365×8 గుణిస్తే 2920 వస్తుంది.   ( ఇప్పుడు  బేసిక్ +da ను 12 తో గుణించగా వచ్చిన విలువను, మరియు 365×8 గుణించగా వచ్చిన విలవతో భాగించగా... ఒక మొత్తం వస్తుంది, దాన్ని 2 తో గుణిస్తే, గంటకు ఎంత అనేది ఖచ్చితమైన OT అంమౌంట్ చూపిస్తుంది)  👉 ఉదాహరణకు:-  ఇక్కడ ఒక ఉద్యోగి basic +Da ను తీసుకుని లెక్కించే ప్రయత్నం చేద్దాము   ఉద్యోగి basic= 27500  DA                 =   9259 ఇప్పుడు రెండు కూడితే Total              =36759 వచ్చిన మొత్తాన్ని 12 తో గుణిస్తే 36759×12 = 441108 మరియు ఫార్ములా లో 365×8=2920             👉    ఇప్పుడు ఫార్ములా లో  వీటిని అప్లై చేస్తే    [ {(Basic+DA)×1...

రావుల పాలెం నుండి సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

చిత్రం

సరస్వతి ధామం పుష్కర యాత్రకు కొవ్వూరు నుండి బస్సులు

సరస్వతి ధామం పుష్కర యాత్రకు కొవ్వూరు నుండి బస్సులు  కొవ్వూరు డిపో నుండి ప్రప్రధమంగా సరస్వతి ధామం పుష్కర యాత్రకు స్పెషల్ బస్సు 14.05,2025 సాయంత్రం 04.00 గంటలకు (సూపర్ లగ్జరీ) బయలుదేరి భాసర జ్ఞాన సరస్వతి దేవి, దక్షిణ త్రివేణి సంగమం (గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతీ నదులు) లో పుణ్య స్నానం ధర్మపురి %% శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కాళేశ్వరం మహా కాళేశ్వరుడు సరస్వతి పుష్కర స్నానం కొండగట్టు ఆంజనేయ స్వామి వేములవాడ రాజ రాజేశ్వర స్వామి వరంగల్ %% భద్రకాళీ మాత రామప్ప రామప్ప దేవాలయ దర్శనం అనంతరం 17.05.2025 న ఉదయం కొవ్వూరు చేరునని డిపో మేనేజర్ వైవివి. ఎన్ కుమార్ తెలిపారు. కొవ్వూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు విశేషంగా ఆధరిస్తున్నందున మరియు సరస్వతి పుష్కరాలకు విశేష స్పందన కారణం గా ది 19.05.2025 న సాయంత్రం 04.00 గంటలకు ఇంద్ర (ఎ సి ) బస్సు బయలుదేరునని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డిపోలో సంప్రదించాలని, యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ తెలియజేశారు

సరస్వతీ నది పుష్కరాలకు 21న ప్రత్యేక బస్సు

ఈ  నెల 15 తేదీ నుంచి 26వ తేదీ వరకు కాళేశ్వరం పుణ్యక్షేత్రం వద్ద నిర్వహించే సరస్వతీ నది పుష్కరాలకు అవనిగడ్డ డిపో నుంచి ఈ నెల 21న సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపారు. 21న రాత్రి 8 గంటలకు బస్సు బయ లుదేరి 22వ తేదీ ఉదయం కాళేశ్వరం చేరుతుందన్నారు. యాత్రికులు పుష్కర స్నానం ఆచరించిన తరు వాత, కాళేశ్వరుని దర్శనం, రామప్ప దేవాలయం, వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి దేవాల యాన్ని దర్శించుకుని 23వ తేదీ ఉదయం అవనిగడ్డ చేరుకుంటారు. ప్రయాణ చార్జీగా రూ.2000లు నిర్ణయించామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

కాకినాడ డిపో నుండి సరస్వతి దామం - పుష్కర యాత్ర

సరస్వతి నదీ పుష్కరాల సందర్భంగా, కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు గారు "స్టార్ లైనర్ నాన్-ఏ.సి స్లీపర్" బస్సును ఈరోజు ప్రారంభించారు. 15.05.2025 నాడు సాయంత్రం 4 గంటలకు మొదటి బస్సు కాళేశ్వరం బయలుదేరి, అక్కడ పుణ్యస్నానాలు, మహాకాళేశ్వరుని దర్శనం తరువాత రామప్ప దేవాలయం, వరంగల్ వేయిస్తంభాల మండపం, భద్రకాళి దేవాలయం దర్శనం, ధర్మపురిలో స్నానాలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్ర దర్శనం తరువాత 18.05.2025 న ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. రెండవ బస్సు 22.05.2025 న "సూపర్ లగ్జరీ బస్సు" బయలుదేరుతుంది. ఆసక్తి గల ప్రయాణికులు డిపో నందు సంప్రదించగలరు.

అరుణాచలం నకు ప్రత్యేక బస్

19.06.2025 న పొదిలి డిపో వారు అరుణాచలం నకు ప్రత్యేక బస్ ను ఏర్పాటు చేయడం జరిగింది online నందు టిక్కెట్ లను బుకింగ్ చేసుకో వచ్చు.  మీ బంధుమిత్రులు తెలుపగలరు టిక్కెట్ ధర కేవలం 2200/- మాత్రమే

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

🌱🌱🌹RTC ఉద్యోగులు అందరికీ 🙏, తెలియని వారు తెలుసుకోవడం కోసం....🌹🌹🌹 🌱🌹Rtc ఉద్యోగులు govt లో కలిసాక మనం కూడా NGO లు గా గుర్తించబడ్డాము,  🌱🌹 ఇక్కడ మన పిల్లలకు కూడా చదువు కోసం,కొంత మొత్తం లో రాయితీ పొందవచ్చును, 👉🌱 ఇలాంటి ఒక విషయం ఉంది అన్న సంగతి ఇప్పుడు class four ఉద్యోగులు మరియు నాన్ గెజిటెడ్(NGO) ఉద్యోగులకు కొంత మందికి తెలియదు, కొంత మంది తేలికగా తీసుకుని పట్టించుకోరు, ...............వాటి గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం........,🌹🌹🌹 విషయం :-..... మీ పిల్లలు LKG నుండి ఇంటర్మీడియట్ సెకండియర్ లోపు చదువుకుంటూ ఉంటే...అట్టి వారికి 2024 - 2025 సంవత్సరానికి Fees రియంబర్స్మెంట్ కొరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కలదు,ఒక్కో బిడ్డకు 2500 చొప్పున ఇద్దరు పిల్లలకు నగదు పొందవచ్చును, 👉🌱🌱రాయితీ పొందడానికి గల మార్గదర్షకాలు చూద్దాం.......🌱🌱🌱 1.  క్లెయిమ్ అవ్వాలి అంటే పిల్లలు చదివే పాఠశాల వారు ఫీజు రసీదులుకు మద్దతు ఇవ్వాలి. 2. గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందుకున్నా లేదా అనే దానితో సంబందం లేకుండా,            పాఠశాల A.P. ప్రభుత్వంచే    గుర్తించబడాలి. లేదా CB...

ఉద్యోగుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఉద్యోగుల సంక్షేమం మరియు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడానికి ఉద్దేశించబడ్డాయి. 2025 సంవత్సరం ఉద్యోగుల బదిలీలకు ఈ నియమాలు వర్తిస్తాయి. ముఖ్య అంశాలు: * ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాలను సాధించడానికి బదిలీల ప్రక్రియ క్రమబద్ధంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. * 2025 సంవత్సరానికి ఉద్యోగుల బదిలీలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. * 2022 నుండి 2024 వరకు జారీ చేసిన బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేయబడింది. ఉద్యోగుల స్థానాలు భర్తీ చేయడానికి మరియు ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలను చేరుకోవడానికి బదిలీలు చేపట్టబడతాయి. బదిలీల సూత్రాలు మరియు షరతులు: * ఐదు సంవత్సరాల నిబంధన: 31 మే 2025 నాటికి ఒకే స్టేషన్‌లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు. సొంత అభ్యర్థనపై బదిలీ కోరుకునే ఉద్యోగులు కూడా బదిలీకి అర్హులు. అయితే, సూపర్యాన్యుయేషన్ (పదవీ విరమణ)కు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు 31 మే 2026 వరకు బదిలీ నుండి మినహాయింప...